శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని నౌహట్టా ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో జవాన్ గాయపడగా.. చికిత్స పొందుతూ సోమవారం ప్రాణాలు కోల్పోయారు. ఈ విసయాన్ని కశ్మీర్ జోన్ పోలీసులు ధ్రువీకరించారు. రెడ్పోరా పార్క్ సమీపంలో ఆదివారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ జరగ్గా.. ఓ పోలీస్తో పాటు ఉగ్రవాది గాయపడ్డాడు. రాంబన్లోని బటోటే నివాసి జవాన్ సర్ఫరాజ్ అహ్మద్ గాయపడ్డాడు.
గాయపడిన జవాన్ను ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. నౌహట్టా ప్రాంతంలోని రెడ్పోరా పార్క్ సమీపంలో భద్రతా దళాల పార్టీని లక్ష్యంగా చేసుకుని బైక్పై వచ్చిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. బలగాలు సైతం వేగంగా స్పందించి దాడిని తిప్పికొట్టారు. ఆ తర్వాత ఉగ్రవాదులు తప్పించుకొని పారిపోయారు. ఆ తర్వాత సంఘటన స్థలం నుంచి మోటార్ సైకిల్, ఏకే47 స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.