భోపాల్, జూలై 10: కరెంట్ కనెక్షన్ కూడా ఇవ్వకుండానే డిజిటల్ క్లాస్ ఏర్పాటు చేసి మధ్యప్రదేశ్ బీజేసీ సర్కారు అభాసుపాలైంది. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమంలో వైరలయ్యాయి. మధ్యప్రదేశ్లోని సింగ్రోలి జిల్లా జోగియాని గ్రామ పంచాయతీలోని ఒక పాఠశాలను ఎంపిక చేసిన అధికారులు.. దానిలో స్మార్ట్ క్లాస్ పథకాన్ని అమలు చేశారు.
అందులో భాగంగా ఆ పాఠశాలకు ఎల్ఈడీ టీవీని ఏర్పాటు చేశారు. ఇంతా చేసిన తర్వాత ఆ పాఠశాలకు కనీసం విద్యుత్తు కనెక్షన్ లేదన్న విషయం గుర్తొచ్చి నాలుక కర్చుకున్నారు. అధికారుల ఈ చర్య గ్రామస్తులు, విద్యార్థుల్లో ఆగ్రహాన్ని కలిగించింది.