చండీగఢ్, జనవరి 17: ప్రతిపక్ష ఇండియా కూటమిలో విభేదాలు ముదురుతున్నాయి. కూటమి భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆప్ మధ్య వైరం పెరుగుతున్నది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తే స్థానాలపై ఓ వైపు చర్చలు జరుగుతుండగానే.. పంజాబ్లో అన్ని లోక్సభ స్థానాల్లో ఒంటరిగానే పోటీచేస్తామని ఆ రాష్ట్ర సీఎం, ఆప్ నేత భగవంత్సింగ్ మాన్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. మొత్తం 13 స్థానాల్లో విజయం సాధించి పంజాబ్లో చరిత్ర సృష్టిస్తామని మాన్ తెలిపారు. కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా స్పందిస్తూ కేజ్రీవాల్, భగ్వంత్ మాన్ను హిట్లర్తో పోల్చారు.