గువాహటి, జనవరి 24: అస్సాంలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 18 మంది నేతలు ఆ పార్టీకి గుడ్బై చెప్పి కాంగ్రెస్లో చేరారు. వీరికి అస్సాం పీసీసీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బోరా మాట్లాడుతూ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై యువతతో పాటు అన్నివర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు.