Bengaluru | బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. నీటిని వృథా చేయొద్దని, ప్రస్తుతం వాడుతున్న నీటి కంటే 20 శాతం తక్కువగా ఉపయోగించాలని పలు హౌసింగ్ సొసైటీలు ఆదేశాలు జారీ చేశాయి. నీటిని వృథా చేస్తే.. వారికి రూ. 5 వేలు జరిమానా విధిస్తామని కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. మొత్తానికి బెంగళూరు వాసులు తాగునీటికి నానా తంటాలు పడుతున్నారు.
బెంగళూరులోని ప్రిస్టెజ్ ఫాల్కన్ సిటీలో సరిపడా నీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్నం తినేందుకు పేపర్ ప్లేట్లు.. ఇతరత్రా వాటికి పేపర్ కప్స్ ఉపయోగిస్తున్నామని ఓ నెటిజన్ తెలిపాడు. చివరకు చేతులు, ముఖంతో పాటు మరొకటి కడుక్కునేందుకు తడి టిష్యూ(Wet tissues) లను ఉపయోగిస్తున్నామని చెప్పాడు. అపార్ట్మెంట్లలో పరిస్థితి మరింత దారుణంగా మారిందన్నాడు.
ఈ నెటిజన్ ట్వీట్పై పలువురు పలు రకాలుగా స్పందించారు. అదే ఫాల్కన్ సిటీలో నివాసముంటున్నాను. ఇలాంటి వార్తలను నమ్మొద్దని, వాటిని వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేయొద్దని ఆ నెటిజన్ కోరాడు. ప్రస్తుతానికి తడి టిష్యూలు ఉపయోగించడం లేదని, నీటితోనే ముఖం, చేతులు కడుక్కుంటున్నామని మరో యూజర్ పేర్కొన్నాడు. మొత్తానికి ఈ ట్వీట్ మాత్రం వైరల్ అవుతోంది.
బెంగళూరు నగరంలో మొత్తం 3 వేలు బోర్లు ఎండిపోయాయని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. తన ఇంట్లో కూడా బోరు ఎండిపోయిందని, తాము కూడా నీటి సమస్యను ఎదుర్కొంటున్నామని చెప్పారు. బోర్లు ఎండిపోవడంతో 50 శాతం మేర నీటి సమస్య ఏర్పడింది. దీంతో వాటర్ ట్యాంకర్లకు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. 5 వేల లీటర్ల వాటర్ ట్యాంకర్కు రూ. 2 వేలు(సాధారణంగా రూ. 500) వసూళ్లు చేస్తున్నారు. ప్రస్తుతం 4 వేల ప్రయివేటు వాటర్ ట్యాంకర్లు ఇతర ప్రాంతాల నుంచి బెంగళూరుకు నీటిని తరలిస్తున్నట్లు సమాచారం.
Residents of Prestige Falcon city are using disposable plates & cups.
Wet tissues to wash their hands & face & the other !That’s how bad the situation is at one of the apartments. Imagine 1000s more across #NammaBengaluru !
— ಮ್ಯಾನೇಜರ್ ಮಗ (@thindi_potha) March 4, 2024