న్యూఢిల్లీ, జూలై 5: క్యాన్సర్ను నివారించేందుకు మాంసం తక్కువగా తినాలని తాజా అధ్యయనం సూచించింది. 40 నుంచి 70 ఏండ్ల మధ్య వయసు గల 4 లక్షల 72 వేల మంది అందించిన వివరాల ఆధారంగా పరిశోధకులు ఈ సూచన చేశారు. వివరాలను ఆన్లైన్ వెబ్సైట్ బీఎంసీ మెడిసిన్లో విడుదల చేశారు. వారానికి ఎన్నిసార్లు మాంసం తింటున్నారు.. చేపలు తింటున్నా రా? లేదా పూర్తిగా శాకాహారం తీసుకుంటున్నారా? అనేది వెల్లడించారు. దాదాపు 11 ఏండ్ల పాటు పర్యవేక్షణ చేశా రు.
ఎక్కువగా మాంసం తినేవారి కం టే వారానికి ఐదుసార్లకు మించి తినని వారి లో పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదం 9 శాతం తక్కువగా ఉన్నదని శాస్త్రవేత్తలు గుర్తి ంచారు. వారానికి ఐదు సార్లు కంటే ఎక్కువ గా మాంసం తినేవారితో పోలిస్తే చేప మా త్రమే తినేవారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ వృద్ధి ముప్పు 20% తగ్గిస్తుందని, శాకాహారం తినేవారిలో 31% తక్కువ రిస్క్ ఉంటుందని పేర్కొన్నది. వారానికి ఐదుసార్లకు ఎక్కువగా మాంసం తినేవారి కంటే ఐదుసార్లకన్నా తక్కువ తినేవారిలో క్యాన్సర్ సోకే ప్రమాదం 2%, చేప మాత్రమే తినేవారిలో 10%, శాకాహారుల్లో 14% తక్కువగా ఉంటుందని తేలింది.