CJI Chandrchud | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: సుప్రీంకోర్టులో అరుదైన ఘటన చోటుచేసుకొన్నది. ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ తన తోటి న్యాయమూర్తులు, పలువురు న్యాయవాదులతో బుధవారం న్యాయస్థానం ప్రాంగణంలో కలియతిరిగారు.
కేసు విచారణ తర్వాత స్వల్ప బ్రేక్ తీసుకొని ధర్మాసనంలోని ఇతర జడ్జీలతో కలిసి కేఫ్టేరియాకు వెళ్లారు. అక్కడ సమోసా తిని, కాఫీ తాగుతూ అందరినీ పలుకరించారు. తిరిగి తన చాంబర్కు వెళ్లే సమయంలో సీజేఐ చంద్రచూడ్ మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడారు.