న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు నేర న్యాయ చట్టాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. వీటిలో అనేక లోపాలు, వైరుద్ధ్యాలు ఉన్నాయని పిటిషనర్ ఆరోపించారు. కొత్త చట్టాలు మరో మూడు లేదా నాలుగు నెలల్లో అమల్లోకి వస్తాయి.
ఈ మూడు చట్టాలను సవాల్ చేస్తూ అడ్వకేట్ విశాల్ తివారీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులు సస్పెన్షన్లో ఉన్నపుడు, ఎటువంటి చర్చ లేకుండా వీటిని ఆమోదించారని తెలిపారు. వీటి ఆచరణ సాధ్యతను మదింపు చేయడం కోసం నిపుణుల కమిటీని తక్షణమే నియమించాలని కోరారు.