న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఇండోనేషియా పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ జరిగే 20వ ఆసియన్-ఇండియా సమ్మిట్లో ఆయన పాల్గొంటారు. దీనితో పాటు 18వ ఈస్ట్ ఏషియా సదస్సులోనూ ఆయన పాల్గొననున్నారు. అయితే ఆ వేడుకల కోసం రూపొందించిన ఆహ్వాన పత్రికలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్(Prime Minister Of Bharat)గా రాశారు. దేశం పేరును మార్చాలని కేంద్ర సర్కార్ భావిస్తున్న నేపథ్యంలో.. ఆసియాన్ ఇన్విటేషన్ లేఖలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్గా పేర్కొనడం మరోసారి చర్చనీయాంశమైంది. ఢిల్లీలో జరగనున్న జీ20 సమావేశాలకు చెందిన డిన్నర్ ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్గా పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ పత్రికపై ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది.
‘The Prime Minister Of Bharat’ pic.twitter.com/lHozUHSoC4
— Sambit Patra (@sambitswaraj) September 5, 2023
ప్రైమ్మినిస్టర్ ఆఫ్ భారత్గా పేర్కొన్న ఇన్విటేషన్ కార్డును బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్లో పోస్టు చేశారు. ప్రైమ్మినిస్టర్ ఆఫ్ భారత్ అని పేర్కొనడం పట్ల కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. మోదీ సర్కార్ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తోందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు.
దేశం పేరును మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై సెప్టెంబర్ 18వ తేదీ నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో చర్చించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ ప్రత్యేక సెషన్పై ఇప్పటి వరకు ఎటువంటి ఎజెండాను కేంద్ర సర్కార్ వెల్లడిచంలేదు.
Look at how confused the Modi government is! The Prime Minister of Bharat at the 20th ASEAN-India summit.
All this drama just because the Opposition got together and called itself INDIA 🤦🏾♂️ pic.twitter.com/AbT1Ax8wrO
— Jairam Ramesh (@Jairam_Ramesh) September 5, 2023