Parliament | న్యూఢిల్లీ : కొత్త పార్లమెంటు భవనంలో సిబ్బందికి కొత్త యూనిఫాం ఒక రోజు ముచ్చటగానే మిగిలింది. ఈ యూనిఫాం కోసం ఉపయోగించిన వస్త్రం దళసరిగా ఉందని, పాకిస్థానీ రేంజర్లు వాడే దుస్తుల మాదిరిగా ఉందని, దీనిని ధరిస్తే ఊపిరి ఆడటం లేదని సిబ్బంది ఆరోపించారు. పార్లమెంటు అంటే సామాన్య ప్రజానీకానికి సంబంధించినదని, ఈ యూనిఫాం పోరాటంలో సైనికులు ధరించే రీతిలో ఉందని ఆరోపించారు.
ఢిల్లీ నగరంలో వాతావరణంలో ఈ దుస్తులను ధరిస్తే, చెమట విపరీతంగా కారుతోందని చెప్తూ, దీనిని ధరించేందుకు నిరాకరించారు. దీంతో దీనిని అధికారులు బుధవారం ఉపసంహరించారు.