న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: పెరిగిపోతున్న మొబైల్ మోసాలను కట్టడి చేసేందుకు కొత్త వ్యవస్థ అందుబాటులోకి రానున్నది. కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్(సీఎన్ఏపీ) సర్వీసును త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ఎవరు ఫోన్ చేస్తున్నారో వారి నెంబరు మాత్రమే మనకు కనిపించేది.
ఈ సర్వీస్ ద్వారా ఫోన్ చేస్తున్న వారి నెంబరుతో పాటు పేరు కూడా డిస్ప్లేపై కనిపిస్తుంది. సిమ్ లేదా ఫోన్ కనెక్షన్ తీసుకున్నప్పుడు ఇచ్చే ధ్రువీకరణ పత్రాల ఆధారంగా టెలికం కంపెనీలు పేర్లను డిస్ప్లే చేయనున్నాయి. మరోవైపు డిజిటల్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు గానూ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కూడా ఏర్పాటు కానున్నది.