షాజహాన్పూర్ (యూపీ), అక్టోబర్ 12: హిందూ ఆలయం కోసం ఓ ముస్లిం వ్యక్తి భూమిని దానంగా ఇచ్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో చోటుచేసుకుంది. ఢిల్లీ-లక్నో జాతీయ రహదారి విస్తరణ పనులకు ఆంజనేయ ఆలయం అడ్డుగా ఉన్నది. దీంతో విస్తరణ పనుల్లో జాప్యం జరుగుతున్నది.
సమస్య ఎంతకు పరిష్కారం కాకపోవడంతో స్పందించిన కచియాని ఖేరా గ్రామానికి చెందిన బాబు అలీ తన భూమిలోని కొంత భాగాన్ని అధికారులకు ఇచ్చారు. తాను ఇచ్చిన స్థలంలోకి ఆంజనేయ ఆలయాన్ని మార్చాలని అధికారులకు సూచించారు.