ఉత్తరప్రదేశ్లో డ్రోన్లతో ఆకాశంలో అద్భుతం సృష్టించారు. కాకోరి బలిదాన్ దివాస్ సందర్భంగా గోరఖ్పూర్లో దాదాపు 750 డ్రోన్లతో స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు. కాకోరి రైలు దోపిడీ కేసులో మొదలైన ఈ ప్రదర్శన.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్తో ముగిసింది. దీనికి సంబంధిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశంలోనే అతిపెద్దదైన డ్రోన్ షో అందర్నీ అలరించింది. కాకోరి ట్రైన్ యాక్షన్లో అమరవీరులకు నివాళులర్పించేందు ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈ డ్రోన్ షో నిర్వహించారు. ఇందుకు మహంత్ దిగ్విజయ్నాథ్ పార్క్ వేదికైంది. ఈ షోను వీక్షించేందుకు గోరఖ్పూర్ సహా పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ ప్రదర్శనలో 750 డ్రోన్లను ఉపయోగించారు. ఇదే దేశంలోనే అతి పెద్ద డ్రోన్ షోగా నిలిచింది. అంతకుముందు 2021 డిసెంబర్ 20 న లక్నోలో 500 డ్రోన్లతో అమర త్యాగుల వీరోచిత గాథను ప్రదర్శించారు.