బాలాసోర్: ఒడిశా రైలు ప్రమాదం(Odisha Train Accident)లో తీవ్రంగా గాయపడ్డ 35 ఏళ్ల వ్యక్తిని దాదాపు 48 గంటల తర్వాత గుర్తించారు. కోరమండల్ రైలులో ప్రయాణిస్తున్న అస్సాంకు చెందిన దులాయి మజుందార్ అనే వ్యక్తిని రెస్క్యూ అధికారులు రక్షించారు. ప్రభుత్వ వివరాల ప్రకారం.. కోరమండల్ రైలులో ఉన్న ఆ వ్యక్తి ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్కు దాదాపు 200 మీటర్ల దూరంలో పడిపోయాడు. అయితే చాలా క్రిటికల్ దశలో ఉన్న అతన్ని సోరో పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన 48 గంటల తర్వాత అతన్ని రెస్క్యూ చేశారు.
తొలుత అతన్ని సోరో హాస్పిటల్కు తరలించారు. ఆ తర్వాత అతన్ని బాలాసోర్ హాస్పిటల్కు మార్చారు. కోరమండల్, బెంగుళూరు ఎక్స్ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య 275కు చేరుకున్న విషయం తెలిసిందే. గాయపడ్డ 260 మంది వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. 900 మందిని ఇప్పటికే డిశ్చార్జ్ చేశారు.