Crime news : దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ భవనం సమీపంలో కలకలం రేగింది. ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. లోకల్ పోలీసులు, రైల్వే పోలీసులు, స్థానికులు తక్షణమే స్పందించి మంటలను ఆర్పేశారు. అతడిని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
ఘటనకు పాల్పడిన వ్యక్తి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, బాగ్పట్ జిల్లాకు చెందిన జితేంద్రగా గుర్తించారు. పార్లమెంట్ సమీపంలోని రైల్వే భవన్ ఆవరణలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే జితేంద్ర ఎందుకు అక్కడికి వచ్చి ఆత్మహత్యాయత్నం చేశాడనే వివరాలు తెలియాల్సి ఉంది.
He was rushed to hospital immediately. pic.twitter.com/hQ94kDFXMt
— Rajiv Sinha (@Rajiv_Sinha89) December 25, 2024