ముంబై : మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండీ నగరంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసిపడుతుండటంతో నాలుగు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.
గోడౌన్ నుంచి మంటలు, పొగ వ్యాపిస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఎవరూ మరణించిన, గాయపడిన వివరాలు ఇప్పటివరకూ వెల్లడికాలేదు. అగ్నిప్రమాదం ఎందుకు సంభవించిందనే వివరాలు ఇంకా తెలియరాలేదు.