భోపాల్: విధి నిర్వహణలో భాగంగా కారులో వెళ్తున్న డీఈవోను కొందరు దుండగులు అడ్డగించి, డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న ఆయనపై ఇంకు చల్లారు. ఆ తర్వాత జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ అక్కడి నుంచి జారుకున్నారు. మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (DEO) SK మిశ్రాకు మంగళవారం జిల్లా కేంద్రంలోనే ఈ చేదు అనుభవం ఎదురైంది.
తనపై ఇంకు చల్లిన వ్యక్తులు స్థానికులేనని, వారిని ముఖాలు గుర్తుపట్టాను కానీ, పేర్లు తెలియదని SK మిశ్రా చెప్పారు. వాళ్లు గంగాజమున స్కూల్లో చోటుచేసుకున్న హిజాబ్ వివాదం గురించి మాట్లాడారని, కానీ తాను ఘటనపై దర్యాప్తు జరపడం లేదు, నివేదికను సమర్పించలేదని, ఆ ఘటనపై దర్యాప్తునకు హై పవర్ కమిటీని ఏర్పాటు చేశారని మిశ్రా తెలిపారు.
నాపై ఇంకు చల్లడానికి వచ్చిన వాళ్లలో కొందరి ముఖాలు గుర్తుపట్టానని, వాళ్లు గతంలో పెండింగ్ బిల్లుల కోసం తన దగ్గరికి వచ్చారని మిశ్రా వెల్లడించారు. బిల్లులు మంజూరు కానందుకు ప్రతీకారంగానే వాళ్లు తనపై ఇంకు చల్లారని ఆరోపించారు. జిల్లాలోని కొన్ని స్కూళ్ల రిపేరింగ్ పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్లో పడ్డాయని, ఆ బిల్లులు ల్యాప్స్ కావడంలో తన ప్రమేయం ఏమీ లేదని ఆయన తెలిపారు.
#WATCH | Madhya Pradesh | A group of people threw ink on Damoh District Education Officer SK Mishra & raised slogans of ‘Jai Sri Ram’.
The Officer says, “…I don’t know their names but they are locals. They were speaking of Ganga Jamuna School issue (hijab controversy). I have… pic.twitter.com/fCqs5k4h6R
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 6, 2023