న్యూఢిల్లీ, జూన్ 7: బాలాసోర్ రైలు దుర్ఘటన జరిగి వారం కూడా కాలేదు, ఒడిశాలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం జాజ్పూర్-కోయింజర్ స్టేషన్కు సమీపంలో రైల్వే పనులు చేస్తున్న కొంతమంది కార్మికులపైకి గూడ్స్ రైల్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు చనిపోగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒడిశా రైలు దుర్ఘటనపై కేంద్రం వాస్తవాల్ని దాస్తున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. సీబీఐ విచారణ చేపట్టినా..అక్కడున్న సాక్ష్యాలు ఎప్పుడో కనుమరుగు అయ్యాయని ఆమె విమర్శించారు.
కాగా, బాలాసోర్ ప్రమాద ఘటన తర్వాత మొదటిసారి కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు బుధవారం షెడ్యూల్ ప్రకారం షాలిమార్ నుంచి చెన్నైకి బయల్దేరినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉండగా, బుధవారం అస్సాంలోని బోకోకు సమీపంలో బొగ్గును తరలిస్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఎల్పీజీ గ్యాస్ అన్లోడింగ్కు వెళ్తుండగా మంగళవారం రాత్రి గూడ్స్ రైల్ బోగీలు పట్టాలు తప్పాయి.