తిరువనంతపురం: సముద్రపు అలలపై నడవాలని, ఆ సరదా అనుభవించాలని ఉందా.. అయితే కేరళకు వెళ్తే సరి. కోజికోడ్లోని బేపూర్ బీచ్లో ఆ రాష్ట్ర పర్యాటక శాఖ ఇటీవల ఫ్లోటింగ్ బ్రిడ్జీని ఏర్పాటు చేసింది. ఈ నడక వంతెన సముద్రపు అలలపై తేలియాడుతుంది. దీంతో సముద్రపు అలలతోపాటుగా దీనిపై ఎంచక్కా నడవవచ్చు. అంత సాహసం చేయలేకపోతే అలల ఆటుపోట్లను ఎంజాయ్ చేయవచ్చు. కేరళ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జి సందర్శకులను ఎంతోగానో ఆకట్టుకుంటున్నది. అలల తాకిడికి కిందకు పైకి లేచే ఈ వంతెనపై నడుస్తూ, ఫొటోలు దిగుతూ పర్యాటకులు కేరింతలు కొడుతున్నారు.
కాగా, ముందు జాగ్రత్త కోసం ఫ్లోటింగ్ బ్రిడ్జిపైకి వెళ్లే పర్యాటకులకు తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు అందించి వాటిని ధరించాలని సిబ్బంది సూచిస్తున్నారు. అలాగే సముద్రపు అలలపై తేలియాడే ఈ నడక వంతెనకు ఇరువైపులా పలు బోట్లలో రెస్క్యూ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఒకవేళ ఎవరైనా ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జి నుంచి సముద్రంలో పడిపోతే వెంటనే వచ్చి రక్షించి బోటులోకి చేరుస్తారు.
Kerala | A floating bridge has been set up by the state tourism department at Beypore beach in Kozhikode to walk along with waves pic.twitter.com/6SGRyUEn2J
— ANI (@ANI) March 27, 2022