న్యూఢిల్లీ: ఈశాన్య బంగాళా ఖాతంలో మయన్మార్ తీరానికి ఆనుకొని అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఒరిస్సాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించింది. కాగా, అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జాయ్ తుఫాను గోవాకు పశ్చిమ దిశగా 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు శనివారం ప్రకటించింది.
రానున్న 24 గంటల్లో మరింత తీవ్రరూపం దాల్చి ఉత్తర ఈశాన్యం దిశగా కదలనున్నట్టు పేర్కొన్నది. కాగా, నైరుతి రుతుపవనాలు శనివారం కర్ణాటక, తమిళనాడులోని పలు ప్రాంతాలకు విస్తరించినట్టు తెలియజేసింది. మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కర్ణాటక మీదుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు విస్తరిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.