అహ్మదాబాద్: ఆరేబియా సముద్రంలోని గల్ఫ్ ఆఫ్ కచ్లో ఇవాళ MVs ఏవియేటర్, అట్లాంటిక్ గ్రేస్ ఓడలు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి ( Ships collision ). శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని రక్షణశాఖ తెలిపింది. అయితే, కొద్దిగా చమురు లీకేజీ చోటుచేసుకున్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం ఇండియన్ కోస్ట్గార్డ్ పడవలను అక్కడ మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ నౌకను కూడా అక్కడికి పంపించారు. ఓడల ఢీ వల్ల ఏమైనా రసాయనాలు సముద్రంలో కలిసి ఉంటే ఈ నౌక క్లియర్ చేయనుంది.