భోపాల్: ఒక బాలుడు లోతైన బావిలో పడ్డాడు. ఆ పిల్లవాడిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సోమవారం లాల్బాగ్ ప్యాలెస్ సమీపంలోని లోతైన పురాతన బావిలో ఒక బాలుడు పడ్డాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు రెస్క్యూ బృందాలను రప్పించారు. ఎస్డీఆర్ఎఫ్ బృందం బావిలోకి దిగి బాలుడి కోసం గాలిస్తున్నదని పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ విశాల్ నాగ్వే తెలిపారు. మరోవైపు ఈ విషయం తెలిసిన స్థానికులు పెద్ద సంఖ్యలో ఆ బావి వద్దకు చేరుకున్నాడు. బాలుడ్ని బావి నుంచి వెలికి తీయడాన్ని ఆసక్తితో గమనిస్తున్నారు.