సైఫై, అక్టోబర్ 11: సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకులు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్యాదవ్కు కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు అశ్రునయనాల మధ్య తుది వీడ్కోలు పలికారు. ఆయన స్వగ్రామమైన సైఫైలో మంగళవారం సాయంత్రం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ములాయంసింగ్ కొడుకు, పార్టీ చీఫ్ అఖిలేశ్యాదవ్ తండ్రి చితికి నిప్పుపెట్టారు. అంతిమయాత్ర పొడవునా ములాయం అభిమానులు ‘నేతాజీ అమర్ రహే’ అంటూ నినదించారు. ములాయంసింగ్ యాదవ్ (82) గురుగ్రామ్లోని ప్రైవేట్ దవాఖానలో సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే.
ప్రముఖుల నివాళి
దిగ్గజ నేత ములాయంకు దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు తుది వీడ్కోలు పలికారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్, కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ చీఫ్ శరద్పవార్, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, నటి, ఎస్పీ ఎంపీ జయాబచ్చన్, హీరో అభిషేక్ బచ్చన్ అంత్యక్రియలకు హాజరయ్యారు.
యూపీలోని ఇటావా జిల్లా, సైఫై గ్రామంలో ములాయం అంత్యక్రియలకు హాజరైన సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్కుమార్