డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్న 41 మంది బాధితులను వెలికి తీయడానికి కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ పూర్తికావచ్చింది. సొరంగంలో కూలిన శిథిలాలను తొలచుకుంటూ రెస్క్యూ టీమ్స్ దాదాపు బాధితులు సమీపంలోకి వెళ్లాయి. ఈ రాత్రికల్లా రెస్క్యూ ఆపరేషన్ పూర్తి కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ పూర్తి కావచ్చిందన్న వార్తల నేపథ్యంలో బాధిత కూలీల కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
#WATCH | Ranchi, Jharkhand: As the rescue operations enter final stage, sweets being distributed among the family members of Anil Bedia, one of the workers who is trapped in the Silkyara tunnel pic.twitter.com/fkLLj6SLEI
— ANI (@ANI) November 28, 2023
మరోవైపు, బాధితులను సొరంగం నుంచి వెలికి తీసిన వెంటనే పరిస్థితి విషమంగా ఉన్న వారికి అత్యవసర చికిత్స అందజేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బాధితులను ఆకాశమార్గంలో తరలించడం కోసం టన్నెల్కు సమీపంలోని చిన్యాలిసౌర్ ఎయిర్ స్ట్రిప్లో చినూక్ హెలిక్యాప్టర్ను సిద్ధంగా ఉంచారు.
అదేవిధంగా రిషికేశ్లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో బాధితుల కోసం 41 పడకలతో కూడిన స్పెషల్ వార్డును సిద్ధం చేశారు. అందులో ట్రామా కేర్ సెంటర్ను కూడా సిద్ధంగా ఉంచారు. కార్డియాలజిస్టులు, సైకియాట్రిక్ స్పెషలిస్టులు, ట్రామా సర్జన్తో కూడిన ఒక బృందం కూడా ఆ ప్రత్యేక వార్డులో రెడీగా ఉన్నది. ఎయిమ్స్ ప్రాంగణంలో హెలిప్యాడ్లో ఒకేసారి మూడు హెలిక్యాప్టర్లను ల్యాండ్ చేయవచ్చని, పరిస్థితి విషమించిన బాధితులను హెలిక్యాప్టర్ల ద్వారా ఎయిమ్స్కు తరలిస్తామని అధికారులు చెప్పారు.
#WATCH | Uttarkashi (Uttarakhand) Tunnel rescue: Rishikesh AIIMS on alert mode for medical services. A 41-bed ward including trauma center ready. A team of cardiac and psychiatric specialist doctors including trauma surgeon ready. Three helicopters can be landed simultaneously at… pic.twitter.com/Xesrf1zc6u
— ANI (@ANI) November 28, 2023
కాగా, ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్పై కొండచరియలు విరిగిపడటంతో కొంత భాగం కూలిపోయింది. దాంతో అక్కడ పని చేస్తున్న 41 మంది కూలీలు ఆ టన్నెల్లో చిక్కుకుపోయారు. ఈ నెల 12న ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అప్పటి నుంచి గత 17 రోజులుగా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. బాధితులకు ఆరు అంగుళాల వ్యాసం ఉన్న పైపు ద్వారా ఆహారం, నీళ్లు అందిస్తున్నారు.