న్యూఢిల్లీ: విదేశాల్లో, విదేశీ జైళ్లలో ఉంటున్న భారతీయుల భద్రత, సంక్షేమం, రక్షణలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని కేంద్ర హోం వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ గురువారం రాజ్యసభకు తెలిపారు.
విదేశీ జైళ్లలో 9,521 మంది భారతీయులు ఉన్నారని, వీరిలో 5,750 మంది గల్ఫ్ దేశాల కారాగారాల్లో ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ మల్లికార్జున ఖర్గే అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను వెల్లడించారు.