న్యూఢిల్లీ: మొజాంబిక్ ఉత్తర కోస్తాలో ఓ పడవ మునిగిపోవడంతో దాదాపు 94 మంది ప్రాణాలు కోల్పోయారు. నంపుల ప్రావిన్స్ దీవికి సమీపిస్తుండగా ప్రమాదం జరిగిందని, ఈ పడవలో సుమారు 130 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు. పడవ సామర్థ్యానికి మించి ప్రయాణికులు ప్రయాణిస్తుండటమే ఈ ప్రమాదానికి కారణమని నంపుల స్టేట్ సెక్రటరీ జైమే నెటో చెప్పారు.