ఆదిలాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఆదిలాబాద్ రిమ్స్లో ఐసొలేషన్ వార్డును ఏర్పాటు చేసి, బాధితులకు చికిత్స అందిస్తున్నది. అవసరమైన ఆక్సిజన్ ట్యాంకర్ను శుక్రవారం రిమ్స్కు పంపించింది. ఇందులో 6 వేల లీటర్ల ఆక్సిజన్ ఉంటుందని, ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్ బాధితులకు ఎంతో ఉపయోగపడుతుందని వైద్యులు తెలిపారు. ఐసొలేషన్ వార్డులో 85 మందికి చికిత్స అందిస్తున్నామని, వీరితోపాటు మరో 112 మంది ఆక్సిజన్ పడకలపై చికిత్స పొందుతున్నారని వైద్యులు పేర్కొన్నారు.