న్యూఢిల్లీ: పుస్తకం మధ్యలో అమెరికన్ డాలర్లను దాచి అక్రమంగా తీసుకొచ్చిన ఓ ప్రయాణికుడు ముంబైలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు. అతని నుంచి రూ.81 లక్షల విలువైన 90 వేల డాలర్లను స్వాధీనం చేసుకున్నామని, ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు. నిఘా వర్గాల సమాచారం మేరకు విమానాశ్రయంలో ఆ ప్రయాణికుడిని ఆపి లగేజీని తనిఖీ చేశామని, విచారణలో అతను సరైన పత్రాలను సమర్పించకపోవడంతో జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించినట్టు అధికారులు వెల్లడించారు.