లక్నో: ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ అధినేత్రి మాయావతికి షాక్ తగిలేలా ఉంది. ఆ పార్టీకి చెందిన 9 మంది రెబల్ ఎమ్మెల్యేలు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ను మంగళవారం కలిశారు. వాళ్లు బీఎస్పీని వదిలి ఎస్పీలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. యూపీ ఎన్నికలకు కొన్ని నెలలే ఉన్న సమయంలో మాయావతికి ఇది మింగుడు పడని విషయమే. గతేడాదే బీఎస్పీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరారు.
అస్లమ్ రైనీ, అస్లమ్ అలీ చౌధరి, ముజ్తబా సిద్ధిఖీ, హకీమ్ లాల్ బింద్, హర్గోబింద్ భార్గవ్, సుష్మా పటేల్, వందనా సింగ్, రామ్వీర్ ఉపాధ్యాయ్, అనిల్ సింగ్ అనే ఈ ఎమ్మెల్యేలను మాయావతి పార్టీ నుంచి బహిస్కరించారు. 2017లో బీఎస్పీ 19 సీట్లు మాత్రమే గెలిచింది. ఉప ఎన్నికల్లో మరో స్థానంలో ఓడిపోగా.. ఎమ్మెల్యేల సంఖ్య 18కి చేరింది. నాలుగేళ్లలో మాయావతి మొత్తం 11 మంది ఎమ్మెల్యేలను బహిష్కరించారు. గతేడాది రాజ్యసభ ఎన్నికల సందర్భంగా తిరుగుబాటు చేసిన ఏడుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి మాయావతి బహిష్కరించిన విషయం తెలిసిందే.