ముంబై, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు నీటితో నిండిన బావిలో పడిపోవడంతో తొమ్మిది మంది జలసమాధి అయ్యారు. ఈ ప్రమాదం దిండోరి నగరంలోని శివాజీనగర్ ప్రాంతంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఇండోర్ గ్రామానికి చెందిన సునీల్ దత్తు దర్గోడే తన కుటుంబం, బంధువులతో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొని కారులో తిరిగి వస్తున్నారు. కారు అదుపుతప్పి రోడ్డు పకన ఉన్న నీళ్ల బావిలో పడిపోయింది.