శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూంచ్ జిల్లాలోని బఫ్లియాజ్ సమీపంలో అదుపుతప్పిన టాటా సుమో (Tata Sumo) లోయలోకి పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సురాన్కోట్కు చెందిన 13 మంది మోరాహ్లో జరిగిన ఓ పెండ్లివేడుకకు హాజరయ్యారు. అనంతరం తిరిగి సురాన్కోట్కు టాటా సుమోలో బయలుదేశారు. అయితే బఫ్లియాజ్ వద్ద అదుపుతప్పిన సుమో.. లోయలోకి దూసుకెళ్లింది.
దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారని, మరో నలుగురు దావాఖానకు తరలిస్తుండగా చనిపోయారని పోలీసులు తెలిపారు. మరో నలుగురు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారని చెప్పారు. సుమో 300 అడుగుల లోతులో పడిపోయిందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.