తిరువనంతపురం: కేరళలోని పాలపక్కడ్లో ఘోర ప్రమాదం జరిగింది. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సు మరో బస్సును ఢీకొట్టింది. దీంతో 9 మంది దుర్మరణం చెందారు. మరో 38 మంది గాయపడ్డారు. ఎర్నాకుళం జిల్లా మూలంతురుతిలోని ఓ పాఠశాలకు చెందిన 42 మంది విద్యార్థులు, ఐదుగురు ఉపాధ్యాయులు.. ఓ టూరిస్ట్ బస్సులో ఊటీకి విహార యాత్రకు వెళ్లారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత వేగంగా వెళ్తున్న టూరిస్ట్ బస్సు.. కేరళ ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన టూరిస్టు బస్సు రోడ్డుపక్కన ఉన్న కాల్వలోకి పడిపోయింది.
సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో టూరిస్టు బస్సును పైకిలేపారు. కాగా, ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు, ఓ టీచర్, ఆర్టీసీ బస్సులోని ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారని అధికారులు వెల్లడించారు. మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారని, వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో 49 మంది ఉన్నారని తెలిపారు.
Kerala | 9 dead, 38 injured after a tourist bus crashed into KSRTC bus in Vadakkenchery in Palakkad district. The tourist bus was carrying students & teachers of Baselios Vidyanikethan in Ernakulam dist & was going to Ooty https://t.co/xIqHhROqff pic.twitter.com/XimJTDTPhA
— ANI (@ANI) October 6, 2022