న్యూఢిల్లీ, జూలై 21: భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య ఏటా పెరుగుతున్నది. ఈ ఏడాది జూన్ నాటికి 87,026 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్టు విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు.
2011 నుంచి ఇప్పటివరకు 17.50 లక్షల మంది తమ పౌరసత్వాన్ని త్యజించారని లోక్సభలో శుక్రవారం ఓ ప్రశ్నకు ఆయన రాతపూర్వక సమాధానమిచ్చారు. 2022లో 2.25 లక్షలు, 2021లో 1.63, లక్షల మంది తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని ఆయన తెలిపారు.