న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: దేశంలోని పలు ఎలక్టోరల్ ట్రస్టులకు వివిధ కార్పొరేట్లు, వ్యక్తుల నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.258.49 కోట్లు విరాళాలకు అందినట్టు ఓ విశ్లేషణలో తేలింది. వీటి నుంచి రూ.258.43 కోట్లు (99.97%) పలు రాజకీయ పార్టీలకు విరాళంగా అందించినట్టు అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫా ర్మ్స్ గుర్తించింది.
అయితే 10 మంది దాత లు రూ.223 కోట్లు ఎలక్టోరల్ ట్రస్టులకు విరాళంగా సమర్పించారు. మొత్తం విరాళాల్లో ఇది రూ.86.27 శాతం. అన్ని ఎలక్టోరల్ ట్రస్టులు అందించిన విరాళాల్లో బీజేపీ ఏకంగా 82.05 శాతం అంటే రూ.212.05 కోట్లు అందుకుంది. ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ అత్యధికంగా రూ.100 కోట్లు విరాళంగా అందించింది.