లక్నో: ఉత్తరప్రదేశ్ను ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీంతో తీవ్రమైన వడగాల్పుల వల్ల గత ఐదు రోజుల్లో 8,056 మంది మరణించినట్లు అంచనా. ఈ నేపథ్యంలో ఈ వేసవిలో దేశంలోనే అత్యంత ప్రాణాంతకమైన రాష్ట్రంగా యూపీ నిలిచింది. (Uttar Pradesh) రెండవ అత్యంత ప్రభావిత రాష్ట్రమైన బీహార్లో 3,615, మధ్యప్రదేశ్లో 2,964, రాజస్థాన్లో 2,664 మరణాలు నమోదైనట్లు తెలుస్తున్నది.
కాగా, ఐదు రోజుల పాటు కొనసాగిన తీవ్ర వడగాల్పుల వల్ల దేశంలో దాదాపు 30,000 మరణాలు సంభవించినట్లు ఒక అధ్యయనం ద్వారా అంచనా వేశారు. ఇందులో ఉత్తరప్రదేశ్లోనే 8,000కు పైగా మరణాలు సంభవించి ఉంటాయని భావిస్తున్నారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలు దేశ జనాభాలో 43 శాతాన్ని మాత్రమే కలిగి ఉన్నాయి. అయితే వేసవి వడగాలుల మరణాల్లో 60 శాతానికి పైగా ఈ ఐదు రాష్ట్రాల్లోనే నమోదు కావడం ఎండ తీవ్రత పరిస్థితులకు అద్దం పడుతున్నది.