గువహటి : అసోంను వరదలు ముంచెత్తుతున్నాయి. వరదలు కొనసాగుతుండటంతో 26 జిల్లాలోని 1089 గ్రామాలు నీట మునిగాయి. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. కొండచరియలు విరిగి పడుతుండటంతో పలు ఇండ్లు నేలమట్టం అయ్యాయి. చచార్, నాగౌన్ జిల్లాల్లో వరద ఉధృతి అధికంగా ఉంది. భారీ వరదల కారణంగా నాలుగు లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
ఇక పలు గ్రామాల్లో చిక్కుకున్న 3 వేల మందిని పునరావాసలకు తరలించేందుకు ఆర్మీ, పారా మిలటరీ ఫోర్సెస్, విపత్తు నిర్వహణ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు. నిరాశ్రయుల కోసం 142 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పునరావాసాల్లో 39,558 మంది ఆశ్రయం పొందుతున్నారు. కొపిలి, దిసాంగ్, బరాక్ నదులు డేంజర్ లెవల్లో ప్రవహిస్తున్నాయి.
#India
Moment the bamboo bridge was washed away in #Assam due to heavy rains and flooding. 20 districts of Assam were affected by #floods on Monday. 2 people died.#indiafloods💬 @GaiaNewsIntl 🌎 pic.twitter.com/kzaDPpQrUS
— ★ GNI ★ GAIA NEWS INTERNATIONAL (@GaiaNewsIntl) May 17, 2022