లక్నో: ఉత్తరప్రదేశ్లోని పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేపై (Purvanchal expressway) ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం బారాబంకి జిల్లాలోని నరేంద్రపుర మద్రహా వద్ద పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేపై రెండు స్లీపర్ కోచ్ బస్సులు ఢీకొన్నాయి. దీంతో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
రెండు బస్సులు బీహార్ నుంచి ఢిల్లీ వెళ్తున్నాయని తెలిపారు. ఒక బస్సును మరో బస్సు ఓవర్ టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని చెప్పారు. ప్రమాద ధాటికి బస్సు ఎడమ భాగం మొత్తం ధ్వసంమయింది. ఈ ఘనటపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.