పట్నా: బీహార్లోని పూర్ణియాలో (Purnia) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు.. నీటి గుంతలో పడిపోయింది. దీంతో కారులో ఉన్న ఎనిమిది మంది అక్కడిక్కడే చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో కారును వెలికి తీశారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. బాధితులంగా కిశన్గంజ్లోని నునియా గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.
శుక్రవారం రాత్రి తారాబడి ప్రాంతంలో జరిగిన ప్రీ వెడ్డింగ్ పార్టీకి హాజరయ్యారని, కారులో ఇంటికి తిరిగి వెళ్తుండగా శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కారును వేగంగా నడపడం, డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు వెల్లడించారు.
Bihar | Eight people died in Kanjia village of Purnia district late last night after their vehicle fell into a pond.
Police say, "8 bodies recovered. They were coming from Tarabadi & going to Kishanganj when it happened. 2 people safely rescued. Bodies being sent for postmortem" pic.twitter.com/qSbYIbFn7j
— ANI (@ANI) June 11, 2022