జబల్పూర్ (మధ్యప్రదేశ్), ఆగస్టు 1: మధ్యప్రదేశ్ జబల్పూర్ జిల్లాలోని ఓ ప్రైవేటు దవాఖానలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. గోహల్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని న్యూ లైఫ్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్లో ఈ ప్రమాదం జరిగింది.
పది మందికిపైగా గాయపడ్డారని, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నదని అధికారులు పేర్కొన్నారు. అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి చేరి మంటలను అదుపులోకి తెచ్చా యి. పేషంట్లను ఇతర దవాఖానలకు తరలించారు. మంటలు చెలరేగినప్పుడు బయటపడేందుకు దవాఖానకు ఒక్కటే మార్గం ఉండటం, మరో దారి లేకపోవడం వల్ల చాలా మంది అందులోనే చిక్కుకున్నట్టు అధికారులు తెలిపారు.