న్యూఢిల్లీ, డిసెంబర్ 4: జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్సీఆర్బీ) తాజా నివేదికలో ఆందోళనకర విషయాలు వెల్లడైంది. దేశవ్యాప్తంగా రోజుకు 78 హత్యలు చోటుచేసుకొంటున్నట్టు పేర్కొన్నది. ఈ హత్యాకాండ రేటు దేశవ్యాప్తంగా ప్రతి లక్ష జనాభాకు 2.1గా ఉన్నదని, ఇది జార్ఖండ్లో అధికంగా 3.6గా ఉన్నదని తెలిపింది. మహిళలు, చిన్నారులు, ఎస్సీ, ఎస్టీలపై కూడా నేరాలు పెరిగాయని తెలిపింది. 2022లో మహిళలపై నేరాలకు సంబంధించి 4,45,256 కేసులు నమోదయ్యాయని(2021తో పోలిస్తే 4% పెరుగుదల), గంటకు 51 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయ్యాయని పేర్కొన్నది.