వీణవంక, మే 3 : ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త శ్రీవిడపు సిద్దిరాములు (69) కరోనాతో ఆదివారం రాత్రి మృతిచెందారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని బేతిగల్ గ్రామానికి చెందిన సిద్దిరాములు సాధారణ కుటుంబంలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీటెక్, మద్రాస్ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేసి 1979 నుంచి 2012 వరకు ఇస్రోలో (శ్రీహరికోట, బెంగుళూరు) శాస్త్రవేత్తగా దేశానికి సేవలందించారు. 10 రోజుల క్రితం అనారోగ్యం బారినపడగా హైదరాబాద్లో ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.