న్యూఢిల్లీ, జూలై 18: కరోనా థర్డ్వేవ్ వస్తుందన్న వార్తల నేపథ్యంలో ఐసీఎంఆర్ కీలక సూచనలు చేసింది. నెలరోజుల వ్యవధిలో ఏదైనా జిల్లాలోని 75 శాతం మందికి వ్యాక్సినేషన్ (కనీసం ఒక్క డోసు) పూర్తిచేస్తే.. మరణాలను 37 శాతం వరకు, కేసులను 26 శాతం వరకు తగ్గించవచ్చని పేర్కొంది. ఈ మేరకు ఐసీఎంఆర్ చేసిన అధ్యయనం వివరాలు లాన్సెట్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.