రాంచీ, ఫిబ్రవరి 19: : గడచిన పదేండ్లలో వేర్వేరు పార్టీలకు చెందిన 740 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారని, వీరందరిపైనా ఆ పార్టీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవినీతి ఆరోపణలు చేసిందని జేఎంఎం ఆరోపించింది. ఇప్పుడు వారంతా బీజేపీకి ఇష్టమైనవారు అయిపోయారని ఎద్దేవా చేసింది.
జేఎంఎం ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నవారంతా అవినీతిపరులేనని, తమ పార్టీలోనివారు మాత్రమే నిష్కళంకులని బీజేపీ భావిస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారిని దేశ వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నదన్నారు.