బెంగళూరు : ఒంటరి జీవితాన్ని ఇష్టపడని ఓ 73 ఏళ్ల మహిళ.. తనకో తోడు కావాలని, మ్యాట్రిమోనిలో యాడ్ ఇచ్చింది. సదరు మహిళ యాడ్కు 69 ఏళ్ల వ్యక్తి స్పందించాడు. ఆ మహిళను పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ వ్యక్తి తెలిపాడు.
కర్ణాటకలోని మైసూరు జిల్లాకు చెందిన ఓ 73 ఏళ్ల మహిళ వృత్తిరీత్యా టీచర్. ఆమెకు పెళ్లి అయినప్పటికీ.. కొన్నాళ్లకే భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఇటీవలే కాలంలో ఆమె తన తల్లిదండ్రులను కోల్పోయింది. దీంతో ఆ టీచర్ ఒంటరిగానే ఉంటోంది. కానీ ఈ జీవితం ఇష్టం లేదని, తనకో తోడు కావాలని మ్యాట్రిమోనిలో యాడ్ ఇచ్చింది. తన కంటే పెద్ద వాడై, బ్రహ్మణ కులస్తుడు అయి ఉండాలని ఆమె తెలిపింది.
సదరు మహిళకు కలిగిన ప్రేమ పట్ల 69 ఏళ్ల వ్యక్తి మనసు పారేసుకున్నాడు. అతను రిటైర్డ్ ఇంజినీర్. ఒంటరి కూడా. తాను ఆమెను పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. ఈ ఇద్దరు త్వరలోనే ఒక్కటవ్వాలని పలువురు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.