జైపూర్, నవంబర్ 25: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 72 శాతం పోలింగ్ నమోదైంది. అయితే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్తో పోల్చితే ఈ సారి కాస్త తగ్గింది. అప్పట్లో 74.06 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలోని 199 అసెంబ్లీ నియోజకవర్గాలకు శనివారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ పోలింగ్ మాత్రం ప్రశాంతంగానే ముగిసింది. ఓట్ల లెక్కింపు వచ్చే నెల 3న చేపట్టనున్నారు. 199 అసెంబ్లీ నియోజవర్గాల్లో 1,862 మంది పోటీకి నిలబడ్డారు. కరణ్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మరణించడంతో పోలింగ్ను వాయిదా వేశారు.