రాయ్పూర్: ఇటీవల చత్తీస్ఘడ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. 90 స్థానాల్లో బీజేపీ 54, కాంగ్రెస్ 35 సీట్లు గెలుచుకున్నది. అయితే ఆ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో.. 72 మంది కోటీశ్వరులే(Crorepatis) ఉన్నట్లు తేలింది. గత విధాన సభతో పోలిస్తే ఈసారి నలుగురి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
బీజేపీ పార్టీకి చెందిన 43 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరుల జాబితాలో ఉన్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన డిక్లేషన్ ఆధారంగా ఈ విషయాన్ని నిర్ధారించారు. డిక్లరేషన్లో ఆ ఎమ్మెల్యేలు తమ ఆస్తులు కోటి కన్నా ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 35 మంది ఎమ్మెల్యేల్లో 29 మంది కోటీశ్వరులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) పేర్కొన్నది.
ఈసారి ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల సగటు ఆస్తి 5.25 కోట్లుగా ఉంది. గత అసెంబ్లీలో ఆ సగటు 11.63 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే భవన్ బోరాకు అత్యధికంగా 33.86 కోట్ల ఆస్తి ఉంది. మాజీ సీఎం భూపేశ్ భగల్ ఆస్తి 33.38 కోట్లు. బీజేపీ ఎమ్మెల్యే అమర్ అగర్వాల్ 27 కోట్లతో మూడవ స్థానంలో ఉన్నారు.