లలిత్పూర్: దేశంలో జరుగుతున్న కొన్ని ఘటనల గురించి వింటుంటే ఎంతో జుగుప్సాకరంగా అనిపిస్తుంటుంది. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లలిత్పూర్ జిల్లాలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ 21 ఏండ్ల యువకుడు 70 ఏండ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లలిత్పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో 70 ఏండ్ల వృద్ధురాలు తన కుటుంబంతో కలిసి ఉంటోంది. అయితే అదే గ్రామానికి చెందిన యువకుడు వృద్ధురాలు ఒంటరిగా ఉన్న సమయం చూసి ఇంట్లో చొరబడ్డాడు. ఆమెపై అత్యాచారం చేసి పారిపోయాడు. వృద్ధురాలు జరిగిన విషయం కుటుంబసభ్యులకు తెలియజేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.