న్యూఢిల్లీ : (First dose) దేశంలోని వయోజనుల్లో 70 శాతం మందికి కొవిడ్-19 వ్యాక్సిన్ మొదటి డోసు అందిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవియా సోమవారం చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కొవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భారతదేశం కొత్త మైలురాళ్లను సాధిస్తున్నదని అన్నారు. దానిని ఇలాగే కొనసాగిస్తూ కరోనాపై పోరాడదాం అని మంత్రి ట్విట్టర్లో పేర్కొన్నారు.
గత 24 గంటల్లో 23,46,176 టీకా డోసుల నిర్వహణతో, సోమవారం ఉదయం 7 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం, కొవిడ్-19 వ్యాక్సిన్ డోస్లు 90.79 కోట్లకు మించాయి. దేశవ్యాప్తంగా జరిగిన 88,05,668 సెషన్ల ద్వారా ఇది సాధించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, దేశ జనాభాలో 25 శాతం మందికి రెండు కొవిడ్ డోసులు అందాయి.
5.67 కోట్లకుపైగా టీకా మోతాదులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ డాటా ప్రకారం, ఒక నెలలో నిర్వహించే సగటు రోజువారీ మోతాదులు మే నెలలో 19.69 లక్షల నుంచి జూన్ నెలలో 39.89 లక్షలకు, జూలై నెలలో 43.41 లక్షలకు, ఆగస్టులో 59.19 లక్షలకు పెరిగాయి. సెప్టెంబర్ నెలలో సగటు రోజువారీ టీకా 79.08 లక్షలుగా ఉన్నది.
ఉత్తరప్రదేశ్ ‘నయా జమ్ముకశ్మీర్’ : ఓమర్ అబ్దుల్లా
ఐక్యరాజ్య సమితిలో వాజపేయి హిందీ ప్రసంగం
ఈ గాజు మహా బలమైనది.. ఫోన్ స్క్రీన్లుగా వస్తే పగిలే సమస్య ఉండదంట!
సరిహద్దులో తాలిబాన్ ఆత్మాహుతి దళాల ప్రత్యేక బెటాలియన్
ఊబకాయానికి ఇది మరో కారణం.. గుర్తించిన శాస్త్రవేత్తలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..