జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఆర్మీ వాహనంపై జరిగిన దాడి ఘటనలో ఏడుగురు ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. రాజౌరీ-పూంచ్ సెక్టార్లలో రెండు గ్రూపులుగా ఉగ్రవాదులు ఆపరేట్ చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. టెర్రరిస్టులు జరిపిన దాడి వల్ల వాహనంలో ఉన్న అయిదుగురు సైనికులు మరణించిన విషయం తెలిసిందే.
బాట-దోరియా ప్రాంతంలో ప్రస్తుతం ఉగ్రవాదుల కోసం తీవ్ర స్థాయిలో గాలింపు మొదలైంది. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని మొత్తం చట్టుముట్టేశారు. డ్రోన్లు, స్నిఫర్ శునకాల ద్వారా ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. అదే ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదుల్ని పట్టుకోవాలన్న ఉద్దేశంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
మృతిచెందిన జాబితాల్లో హవల్దార్ మణ్దీప్ సింగ్, లాన్స్ నాయక్ దేబశిశ్ భస్వాల్, లాన్స్ నాయక్ కుల్వంత్ సింగ్, సిపాయి హరికిషన్ సింగ్, సిపాయి సేవక్ సింగ్లు ఉన్నారు. ఆర్మీ, పోలీసు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయని రక్షణ వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదులు పాక్లోని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఉంటారని భావిస్తున్నారు.