శ్రీనగర్, ఆగస్టు 16: వారంతా అమర్నాథ్ యాత్ర విధులను ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. కానీ దురదృష్టవశాత్తూ వారి వాహనం లోతైన లోయలో పడిపోయింది. దీంతో ఏడుగురు మరణించారు. వీరిలో ఆరుగురు ఐటీబీపీ జవాన్లు కాగా.. ఒకరు పోలీసు. ఈ దుర్ఘటన మంగళవారం జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో చోటుచేసుకుంది. అమర్నాథ్ యాత్ర భద్ర తా విధులు నిర్వర్తించిన వారిలో 37మం ది ఓ బస్సులో తిరుగుపయనమయారు. ఈ బస్సు పహల్గామ్ వద్దకు చేరుకొనేసరికి బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో అదుపు తప్పిన బస్సు పక్కనే ఉన్న భారీ లోయలో పడింది. దీంతో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. చికిత్స పొందుతూ ఐదుగురు మరణించారు.